సోషల్ మీడియా రీల్స్ మోజులో యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. తాజాగా.. ఓ పదేళ్ల బాలుడు రైల్వే పట్టాలపై పడుకొని ప్రమాదకర విన్యాసం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ట్విట్టర్లో పోస్టు చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, సోషల్ మీడియా ముప్పు నుంచి దూరం ఉంచాలని సజ్జనార్ హెచ్చరించారు.