AP Fact Check Team Ntr Bharosa Pension Cancelled: డిసెంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద కొత్తగా 8,190 మందికి రూ.4వేల చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొని, దేశంలోనే ఏపీలో అధిక పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. గత 18 నెలల్లో రూ.50 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు పింఛన్లకే వెచ్చిస్తున్నామని చెప్పారు. అయితే, పింఛన్ల కోతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది.