ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు అందించే ఆహారంలో మార్పులు చేయనుంది. జూన్ నుండి కొత్త మెనూ అమలులోకి రానుంది. ఇందులో భాగంగా, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు వారానికి రెండుసార్లు ఎగ్ఫ్రైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందిస్తారు. అన్ని కూరల్లో మునగపొడిని చేర్చనున్నారు. బాలామృతంలో తీపిని తగ్గిస్తారు. ఈ మార్పులు తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.