వారికి త్వరలోనే ఇండ్ల స్థలాలకు పట్టాలు.. మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు..

3 months ago 10
సింగరేణి భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన.. డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని.. కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రికి వివరించారు. ఈ ప్రాంతాలను గనుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి పునరావాసం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నిలిచిపోయిన 76 జీవో అమలుపై మంత్రి పొంగులేటితో మాట్లాడి ఇళ్ల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారు.
Read Entire Article