జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని.. ఈ ఉపఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. మైనార్టీలు సహా నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.