పెరుగుతున్న గ్యాస్, కరెంటు బిల్లులతో విసిగిపోయిన ఓ వ్యక్తి సరికొత్త ఆవిష్కరణ చేశాడు. వృథాగా పారబోసే ఇంజిన్ ఆయిల్తో నడిచే స్టవ్ను సృష్టించాడు విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన కాసా సత్యనారాయణ. కేవలం 100 మిల్లీలీటర్ల ఆయిల్తో ముగ్గురికి సరిపడా వంట చేయొచ్చని తెలిపాడు. గతంలో చదువుకున్న ఐటీఐ పరిజ్ఞానంతోనే రూ.2,500 ఖర్చుతో దీన్ని తయారు చేసినట్లు వెల్లడించాడు. ప్రభుత్వ వసతి గృహాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సత్యనారాయణ కోరుతున్నాడు.