ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం వాహనమిత్ర పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వాహన మిత్ర పథకం అమలు చేయనుండగా అర్హులైన ఆటో, క్యాబ్ యజమానులకు ఏడాదికి రూ.15000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే దరఖాస్తులలో సమస్యలు ఉంటే అర్జీల నమోదు కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు.