మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రహదారుల విస్తరణ, అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా అనకాపల్లిలో రింగ్ రోడ్డు విస్తరణకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవలే శంకుస్థాపన కూడా నిర్వహించారు. వీటితో పాటుగా అనకాపల్లిలో నూకాలమ్మ ఆలయానికి చేరుకునేలా నాలుగు రహదారుల అభివృద్ధి, వీధుల విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తి అయితే అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడినట్లేనని అధికారులు చెప్తున్నారు.