విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏపీ దేవాదాయ శాఖ ఆన్లైన్ సేవలు ప్రారంభించింది. కనకదుర్గమ్మ దర్శనం టికెట్ల దగ్గర నుంచి వసతి, ప్రసాదం సేవల వరకూ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా సేవలు పొందవచ్చు. ఆలయంలో సేవల కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.