విజయవాడ నుంచి గుడివాడ రైలులో ప్రయాణించాలంటే ఒక రకంగా నరకమే అని చెప్పొచ్చు. తక్కువ దూరమే అయినా సింగిల్ లైన్ కావడంతో సుమారు మూడు గంటల సమయం పట్టేది. రైలు ఎక్కడ ఆపేస్తారో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు.. ఇక విజయవాడ వచ్చాము అనుకునేలోపే పక్కన ఆపేసి గంటల కొద్ది వెయిట్ చేయించేవారు. కానీ ఇదంతాా గతం.. ఇప్పుడు మాత్రం సరైన సమయానికే గమ్య స్థానం చేరుకుంటుంది. బ్రాంచ్ లైన్ వేయడంతో ప్రయాణం సాఫీగా సాగుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.