Vijayawada Durga Temple Devotees Social Media: సోషల్ మీడియాలో దుష్ప్రచారంతో విజయవాడ దుర్గమ్మ ఆలయం దగ్గర ఇబ్బందులు ఎదురవుతున్నాయట. పారాయణాలు, ప్రసాదాల పంపిణీ వంటి వాటి కోసం కొందరు భక్తులు తరలివచ్చి అధికారులకు తలనొప్పి తెప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు స్వాములు చెప్పిన మాటలు విని వచ్చిన భక్తులు, ఆలయ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఈ మేరకు దుర్గ గుడిలో భక్తుల భద్రత, ఆలయ పవిత్రత కాపాడేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.