Vijayawada Durga Temple Darshan Booking: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం, పారదర్శకత పెంచడానికి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ దుర్గగుడిలో దర్శన టిక్కెట్లు, సేవలు, వసతి, ప్రసాదాలు, విరాళాలు అన్నీ ఆన్లైన్లోనే. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే ఈ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వెబ్సైట్లు, యాప్, వాట్సప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే పలు ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి.