ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సింగపూర్ వెళ్లాలంటే ఇకపై హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా వెళ్లాల్సిన అవసరం లేదు. విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. నవంబర్ 15వ తేదీ నుంచి విజయవాడ సింగపూర్ ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బుకింగ్ ప్రారంభమైంది. విజయవాడ నుంచి సింగపూర్కు 4 గంటలలోనే కేవలం 9,239 రూపాయలకే చేరుకునే వీలు దొరకనుంది.