విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గతంలో రూ.700 కోట్లతో ప్రతిపాదించిన 7 కిలోమీటర్ల ఎలివేటెడ్ వంతెన నిర్మాణం ఆగిపోయింది. దీని నిర్మాణం ఆపేయాల్సిందిగా ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త బైపాస్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ రానున్న నేపథ్యంలో దీని అవసరం లేదని అధికారులు తేల్చారు. గతంలో డబుల్ డెక్కర్ వంతెన ఆలోచన ఉన్నా, ఇప్పుడు ప్రణాళిక మారింది. దీంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు ఇప్పట్లో పరిష్కారం లభించేలా లేదు అంటున్నారు.