సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోతోంది. పంతంగి టోల్ప్లాజా వద్ద రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ట్రాఫిక్ జామ్లను నివారించడానికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.