Krishna Principal Chatting With Student: మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్ వ్యవహారం వివాదాస్పదమైంది. ప్రిన్సిపల్ విద్యార్థినులతో చాటింగ్ చేస్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే వెళ్లి కాలేజీలో ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారం వివాదం కావడంతో కాలేజీ యాజమాన్యం రంగంలోకి దిగింది.. ప్రిన్సిపల్ను ఉద్యోగం నుంచి తప్పించింది. అయితే విద్యార్థి సంఘాలు కూడా రంగంలోకి దిగాయి.. ఆ కాలేజీ దగ్గర నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.