విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలు చెల్లింపు ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం నూతన సంస్కరణలు తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ కాలేజీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయగా.. ఇకపై విద్యార్థుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేయనుంది. ఎస్సీ విద్యార్థుల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తన వాటా నిధులు విడుదల కాగానే.. విద్యార్థుల బ్యాంక్ ఖాతాలలోని బోధనా ఫీజులు జమ కానున్నాయి..