తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. దసరా, దీపావళి నాటికి బకాయిలు ఇస్తామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదని యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తుపై ఆధారపడిన ఈ బకాయిలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని సమాఖ్య డిమాండ్ చేస్తోంది. సమస్య పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించింది.