Veg Biryani in Breakfast: తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే కొత్త సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం అందించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. పేద విద్యార్థులకు పోషకాహారం, హాజరు శాతం పెంచడమే దీని లక్ష్యం. దీనితో పాటు ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం, కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ కాలేజీలు, పాఠశాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.