Telangana Scholarship Dues Release 2025: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పింది. వారికి చెల్లించాల్సి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 2,813 కళాశాలలకు సంబంధించిన రూ.161 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖకు ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తాము సరిదిద్దుతున్నామని భట్టి ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యార్థులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.