విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పేరుకుపోయిన రూ.303 కోట్ల ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఈ డబ్బును త్వరగా చెల్లించి, విద్యార్థుల కష్టాలను తీర్చాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఆలస్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.