తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ పేద విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడి పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నారు. తమిళనాడు తరహాలో ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం దాదాపు 400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతో బడిలో చేరే పిల్లల సంఖ్య, హాజరు కూడా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.