విద్యార్థులు స్కూలుకు రావటం లేదని.. ఈ మాస్టారు చేసిన పని తెలిస్తే శెభాష్ అనాల్సిందే..

8 months ago 9
కాకినాడ జిల్లాలో విద్యార్థుల కోసం ఓ ఉపాధ్యాయుడు గొప్ప పని చేశారు. గొల్లప్రోలు మండలం సూరంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటం గమనించిన అనిశెట్టి సీతారామరాజు అనే ఉపాధ్యాయుడు, పిల్లలు పాఠశాలకు రాకపోవడానికి గల కారణాన్ని తెలుసుకున్నారు. రైల్వే అండర్‌పాస్‌ వద్ద ప్రమాదకరమైన మురుగు కాలువ కారణంగా విద్యార్థులు రాలేకపోతున్నారని తెలుసుకుని, సొంత డబ్బుతో లక్ష రూపాయలు వెచ్చించి కాలిబాట వంతెన నిర్మిస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడి గొప్ప మనస్సును గ్రామస్థులు కొనియాడుతున్నారు.
Read Entire Article