భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మెండికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, పురోహితులు జిల్లెపల్లి గోవర్ధన్ చారి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మరణానికి కొద్దిసేపటి ముందు కూడా ఆయన రాశిఫలాలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. గోవర్ధన్ చారి అకాల మరణవార్త గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.