జనసేన పార్టీకి చెందిన మరో నేత వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుపై దాడి చేశారనే ఆరోపణలు రావటంతో జనసేన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన కర్రి మహేష్ అనే వ్యక్తి.. హోంగార్డు మీద దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసులు కర్రి మహేష్ మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్రి మహేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది.