విశాఖ: డిగ్రీ విద్యార్థి బలవన్మరణం.. మహిళా లెక్చరర్‌పై ఆరోపణలు!

4 months ago 8
విశాఖపట్నంలో ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే సాయితేజ ఆత్మహత్యకు మహిళా లెక్చరర్ వేధింపులే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై సాయితేజ కుటుంబసభ్యులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. సాయితేజ స్నేహితులు, కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా లెక్చరర్ మాత్రం సాయితేజను తాను కొడుకులా చూశానని చెప్తున్నారు.
Read Entire Article