Visakhapatnam Gold theft: బంగారు షాపులలో చోరీలకు పాల్పడుతున్న మహిళలను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ల మాదిరిగా షాపులలోకి ప్రవేశించి.. సమయం చూసి చీరలు, జడలో బంగారు నగలు దాచేసి ఉడాయిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. గాజువాక, పెందుర్తిలలో జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు మహిళలను విశాఖ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు ప్రయత్నిస్తూ వీరు షాపు యజమానులకు దొరికిపోగా.. వారు పోలీసులకు అప్పగించారు.