విశాఖలో త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త హోటళ్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్తో కలిసి గంటా శ్రీనివాసరావు ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో-2026ను ప్రారంభించారు. 3 రోజుల బిజినెస్ ఎక్స్పోలో 180కి పైగా ఎగ్జిబిటర్లు, 60కి పైగా స్టార్టప్లు, 50 ఆర్థిక సంస్థలు పాల్గొననున్నాయి.