Tcs To Start Operations In Visakhapatnam: విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చే ఏపీ ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా, మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ త్వరలోనే తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. సంక్రాంతి తర్వాత, జనవరి నెలాఖరులోగా టీసీఎస్ విశాఖలో అడుగుపెట్టనుంది. రుషికొండ ఐటీ పార్కులో 21.6 ఎకరాల భూమిని కేటాయించగా, రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగ్నిజెంట్ తర్వాత టీసీఎస్ రావడం విశాఖకు శుభపరిణామం.