Visakhapatnam Trains Cant Stop In Secunderabad: విశాఖపట్నం నుంచి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విశాఖపట్నం నుంచి వెళ్లే మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు.. వచ్చే నెల నుంచి ఈ నాలుగు రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగవు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి వెళ్లే మరో నాలుగు రైళ్లను కూడా దారి మళ్లిచారు.