AP Govt Rs 478 Crore For Roads In Visakhapatnam Vijayawada: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో రోడ్ల అభివృద్ధికి పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. విజయవాడ, విశాఖపట్నంలో రూ.478 కోట్లతో 112 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. 'యాన్యుటీ మోడల్' ద్వారా ప్రైవేట్ సంస్థలు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. తొలి ఏడాది 40% నిధులు, మిగిలినవి తొమ్మిదేళ్లలో చెల్లిస్తారు. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించడంతో పాటు నాణ్యతను పెంచుతుంది.