Delhi High Court Dismissed Pil On Visakhapatnam Airport: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖపట్నానికి చెందిన గోపాల కృష్ణ కొసరాజు అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 30 ఏళ్ల పాటు సేవలందించిన విశాఖ ఎయిర్పోర్ట్ ఏకపక్షంగా, బలవంతంగా మూసేశారని కోర్టుకు తెలిపారు. ఈ అంశం ఏపీకి చెందినది కాబట్టి అక్కడి హైకోర్టును ఆశ్రయించాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.. కీలక వ్యాఖ్యలు చేసింది.