Visakhapatnam Steel Plant Lands Auction: విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు సంబంధించి భూముల వేలానికి సిద్ధమయ్యారు. సీతమ్మధార, గాజువాక ప్రాంతంలోని ప్లాట్లకు వేలం నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 459 ప్లాట్లను అక్టోబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. హెచ్బీ కాలనీలోని 456 ప్లాట్లకు సంబంధించి రూ.838.93 కోట్లు రిజర్వ్ ధర.. గాజువాక ఆటోనగర్ ప్రాంతంలోని బ్లాక్-2, బ్లాక్-3లోని మిగిలిన ప్లాట్లకు రూ.19.75 కోట్లు రిజర్వ్ ధరతో వేలం నిర్వహిస్తారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.