Visakhapatnam Beach Road Gold On Wheels: విశాఖపట్నం బీచ్ రోడ్డులో రోడ్డుపక్కన బంగారం అమ్మేస్తున్నారు. ఐస్క్రీమ్ బండి సెటప్ ఏర్పాటు చేసి బంగారం కాయిన్లు విక్రయిస్తున్నారు. గోల్డ్ ఆన్ వీల్స్ పేరుతో జ్యువెలరీ సంస్థ సరికొత్త ఆలోచన చేసింది. ఆదివారం ఇలా బంగారం విక్రయిస్తుండటంతో జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. రూ.800 నుంచి అక్కడ బంగారం దొరుకుతోంది. కొంతమంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.