Visakhapatnam Google Data Center Land Transfer: విశాఖపట్నంలో గూగుల్ 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రభుత్వం భూముల బదిలీకి అనుమతి ఇచ్చి, ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి డేటా సెంటర్ను నిర్మించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ సంస్థలు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.