విశాఖపట్నం రాష్ట్ర సాంకేతిక రాజధానిగా మారనుంది. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఇది రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమని, భవిష్యత్తుకు ఇది ఎంతో కీలకమని టెక్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ అభిప్రాయపడ్డారు.