Pendurthi Four Members Of Family Suicide: విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చింతలగ్రహారం కాలనీలో మల్లా ప్రవీణ్ కుమార్ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. ప్రవీణ్ ముందుగా తన భార్య, ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి.. తర్వాత తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాఖీ కావడంతో కుటుంబంతో సరదాగా గడిపారు.. రాత్రికి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.