Visakhapatnam Double Decker Buses Run Towards Simhachalam: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సుల రూట్ మార్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్కేబీచ్ నుంచి తొట్లకొండ వరకు నడుస్తున్న ఈ బస్సులను సింహాచలం వైపు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకుని, ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ఈ కొత్త రూట్ పై స్పష్టత రానుంది.