Viskhapatnam Sairam Colony Reservoir: విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో మధురవాడ జోన్లోని 5, 6 వార్డుల ప్రజల తాగునీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి. సాయిరాంకాలనీ కొండపై రూ.3.5 కోట్లతో నిర్మిస్తున్న కొత్త రిజర్వాయర్ పనులు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వేగంగా సాగుతున్నాయి. మార్చి నెలాఖరులోగా పూర్తయితే, 31 వేల మందికి వేసవిలో నిరంతరాయంగా తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఈ మార్చికి అందుబాటులోకి తెచ్చే దిశగా పనుల్ని ముమ్మరం చేశారు.