సాగరతీరం విశాఖపట్నంలోని క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి వార్త.. రెండు నెలల వ్యవధిలో నాలుగు క్రికెట్ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత పురుషుల జట్టు ఆడే రెండు మ్యాచ్లతో పాటుగా మహిళల క్రికెట్ జట్టు పాల్గొనే మరో రెండు మ్యాచ్లకు కూడా విశాఖలోని ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ దక్షిణాఫ్రికా మూడో వన్డేతో పాటుగా న్యూజిలాండ్తో ఓ టీ20 మ్యాచ్ విశాఖలో జరగనుంది. అలాగే భారత్ శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య విశాఖ వేదికగా రెండు టీ20లు జరగనున్నాయి.