సాగరతీరం విశాఖపట్నానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులలో సగం విశాఖ వైపు వెళ్తున్నాయి. తాజాగా విశాఖలో సిఫీ ఏఐ డేటా సెంటర్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ను రెండు దశలలో రూ.1500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. విశాఖకు త్వరలోనే అతిపెద్ద స్టీల్ప్లాంట్ రాబోతోందన్నారు. ఢిల్లీలో ప్రకటన ఉంటుందని వెల్లడించారు. అలాగే నాలుగు జిల్లాలతో గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.