రైళ్లలో దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు.. సినిమా రేంజ్లో పట్టుకున్నారు. సాధారణ ప్రయాణికుడి లాగే రైలు ఎక్కి.. ఏసీ కంపార్ట్మెంట్లే టార్గెట్గా చోరీలు చేస్తున్న ఘరానా దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతడి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేశారు. రోజువారీ కూలీ పనిచేసే ఆ వ్యక్తి.. డబ్బుపై ఆశతో.. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.