ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తు్న్న సంగతి తెలిసిందే. నెల్లూరులో ప్రయోగాత్మకంగా ఈ విధానం పరిశీలించారు. అక్కడ సక్సెస్ కావటంతో మిగిలిన చోట్ల అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలోనూ స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ స్ట్రీట్లో కంటైనర్ల ద్వారా వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి వీధి వ్యాపారులకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 8వ తేదీ వరకూ సమయం ఉంది.