తెలంగాణ సర్కార్ వృద్ధులకు శుభవార్త చెప్పింది. అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక జెరియాట్రిక్ సేవలు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు, అనవసర సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే రిఫర్ చేయాలని, ప్రైవేట్కు పంపొద్దని స్పష్టం చేశారు.