తెలంగాణలో వృద్ధుల భూములను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. భూ యజమానులు అప్రమత్తంగా ఉండాలని.. స్థలాన్ని తరచుగా పర్యవేక్షించాలని, అమ్మకానికి లేదని బోర్డు పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.