భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. మంత్రాలు చేయాలని నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం షూ లేసుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో మరో వ్యక్తితో కలిసి చంపినట్లు నేరం అంగీకరించాడు.