తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు రక్తం దొరక్క వినోద్ బాలు అనే యువకుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏం చేయాలో తెలియలేదు. ఎవ్వరిని బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడతడు అనుభవించిన మనోవేధన అంతా ఇంతా కాదు. చివరి క్షణంలో రక్తం దొరకడం వల్ల తన తండ్రి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అప్పుడు రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించిన వినోద్ బాలు.. రక్తదాన ప్రచారాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాడు. 2014లో 'ఫ్రెండ్స్ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్' స్థాపించి, 1100 రక్తదాన శిబిరాలు నిర్వహించి 64వేల యూనిట్ల రక్తం సేకరించాడు. వేల మంది ప్రాణాలు కాపాడాడు.