Ys Jagan Aunt Suseelamma Passed Away: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ (85) పులివెందులలో కన్నుమూశారు. ఆమమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో ఉన్న ఆమెను రెండు నెలల క్రితం జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఇవాళ అంత్యక్రియలకు జగన్ హాజరవుతారని చెబుతున్నారు.