Cyclone Montha Ys Jagan Flight Cancelled: మొంథా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కాకినాడ దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విమాన సర్వీసు రద్దు కావడంతో.. మాజీ సీఎం జగన్ బెంగళూరులోనే ఉండిపోయారు. ఆయన విజయవాడ ప్రయాణం వాయిదా పడింది. తుఫాన్ బాధితుల కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.