వైద్యం వికటించడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ చందానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండకు చెందిన రాజు, సిఫోరా తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురంలో నివాసముంటూ కంప్రెషర్ పనులు చేసుకుంటున్నారు. రాజు కుమారుడు జాన్సన్ (4) రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం బాలుడికి వాంతులు కావడంతో చందానగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. అయితే అక్కడ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటికే బాలుడు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.